ఆదివారం (మార్చి 23న) రోజున ఎంఎంటీఎస్ టైన్లో జరిగిన అత్యాచార యత్నం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కదులుతున్న రైలు నుంచి కిందికి దూకి.. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఎస్పీ చందనా దీప్తి పరామర్శించారు. పరామర్శ అనంతరం.. కీలక విషయాలు వెల్లడించారు. బాధితురాలు లేడిస్ కంపార్ట్ మెంట్లోనే ఎక్కిందని.. ఆమె ఎక్కిన సమయంలో మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని.. మధ్యలో ఓ పురుషుడు కూడా ఎక్కినట్టు ఎస్పీ తెలిపారు.