గద్దర్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతల స్ట్రాంగ్ కౌంటర్

2 months ago 5
దివంగత ప్రజా గాయకుడు గద్దర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం (జనవరి 27) ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు ఇచ్చారు. బీజేపీకి జై కొడితేనే.. పద్మ అవార్డులు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలు హాస్యాస్పదమన్నారు. ఆయన ఒక కేబినెట్ మినిస్టర్ అని మరచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైట్ వింగ్, బీజేపీ భావజాలం ఉన్న వాళ్లకే పద్మ అవార్డులు ఇస్తామనే విధంగా ఆయన మాట్లాడుతున్నారని అయితే (బీజేపీ పాట పాడిన వారు, బీజేపీ గొంతు పలికిన వారికే అవార్డులు ఇస్తారా? అని ప్రశ్నించారు.
Read Entire Article