జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు స్టేజి వద్ద ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి 44పై హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తోన్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలిసింది.