ఏపీలో ఖాళీ అయిన రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ప్రభుత్వం పేర్లను ఖరారు చేసింది. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య, మహిళా నేత దళవాయి రమాదేవికి అవకాశం లభించింది. వీరిద్దరినీ నామినేట్ చేస్తూ ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం గవర్నర్ ఆమోదం కోసం పంపించారు. దళవాయి రమాదేవి అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.