హైదరాబాద్ నగరానికే తలమానికమైన హుస్సేన్ సాగర్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. కాలుష్య నివారణ, మురుగునీటి మళ్లింపు, పర్యావరణ పరిరక్షణతో పాటు లేక్ ఫ్రంట్ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దటమే దీని ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా కన్సల్టెన్సీ ఎంపికకు వారంలో టెండర్లు పిలవనున్నారు. సంజీవయ్య పార్కులో లెర్నింగ్ సెంటర్, లుంబినీ పార్కులో కొత్త లేజర్ షో, సైక్లింగ్, యోగా జోన్ల ఏర్పాటుతో పాటు ఎస్టీపీల సామర్థ్యాన్ని పెంచి సాగర్ పరిసరాలను ప్రముఖ పర్యావరణ వినోద కేంద్రంగా మార్చనున్నారు.