తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 2న లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను అందుబాటులోకి తేనుంది. భూభారతి చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాప్ తప్పనిసరి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 7,000 మందికి మొదటి దశ శిక్షణ పూర్తవగా, రెండో దశ శిక్షణ ఈ నెల 18న 23 జిల్లా కేంద్రాల్లో ప్రారంభమవుతుంది. ఈ కొత్త విధానం భూముల సర్వేలో పారదర్శకతను పెంచి, ప్రజల సమయాన్ని ఆదా చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.