విశాఖలో సంచలనం రేపిన మౌనిక హత్య కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. నేవీ అధికారి రవీంద్ర.. ప్లా్న్ ప్రకారమే మౌనికను హత్య చేసినట్లు తెలిపారు. డేటింగ్ యాప్లో రవీంద్రకు, మౌనికతో పరిచయమైందని పోలీసులు తెలిపారు. అయితే పెళ్లి తర్వాత కూడా రవీంద్ర.. మౌనికతో రిలేషన్షిప్ కొనసాగించినట్లు వెల్లడించారు. అభిప్రాయభేదాలు రావటంతో ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు విశాఖ ఏసీపీ శ్రీనివాసరావు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.