పాస్టర్ అభినయ్ దర్శన్ జైలు నుంచి విడుదలయ్యారు. పలు ఆరోపణలలో అరెస్టైన ఆయన నర్సీపట్నం సబ్ జైలులో రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే జైలు నుంచి విడుదలైన ఆయన.. తనను గౌరవంగా చూసుకున్నందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక తన పాదయాత్రపై వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను గాయపడిన సింహాన్ని అని.. మరింత కసిగా వేటాడతానని.. పాడేరు నియోజకవర్గం నుంచి తన పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు అభినయ్ దర్శన్.