Guntur Woman Donation Of Property After Death: జీఎస్టీ రిటైర్డ్ ఉద్యోగిని పెద్ద మనసు చాటుకున్నారు.. తన ఆస్తిని స్వచ్ఛంద సేవా సంస్థలకు దానం చేశారు. ఈ మేరకు గుంటూరులో జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి సమక్షంలో వివిధ సేవా సంస్థలకు చెక్కులు అందజేశారు. అమ్మ ఛారిటబుల్ ట్రస్టుకు రూ.15 లక్షలు, శిర్డీ సాయి సేవా ట్రస్ట్కు రూ.10 లక్షలు, శిష్ట్లా రాజ్యలక్ష్మి పేరుతో ఏర్పాటైన మెమోరియల్ ట్రస్ట్కు రూ.36 లక్షలు చెక్కులు అందజేశారు.