ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరా నిలిచిపోయింది. సప్లయ్ చైన్ తెగిపోవటంతో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. దీంతో హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టళ్లలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు చపాతీ, పూరీ, టీ, కాఫీ వంటి వంటకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. బెంగళూరు, ముంబైల తరహాలోనే హైదరాబాద్లోని హోటళ్లు కూడా మెనూను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.