Guntur Nri Donates Rs 4 Crore Community Buildings: గుంటూరుకు చెందిన ఎన్నారై దంపతులు డాక్టర్ సూదనగుంట రాఘవేంద్రప్రసాద్, కల్యాణి ప్రసాద్ సామాజిక భవనాల నిర్మాణానికి రూ.4 కోట్ల విరాళం అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వారిని సన్మానించారు. గతంలో క్యాన్సర్ ఆసుపత్రికి రూ.10 కోట్లు విరాళం ఇచ్చారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఈ భవనాలు నిర్మిస్తారు. అలాగే డీసీసీబీ ఛైర్మన్గా మక్కెన మల్లికార్జునరావు, డీసీఎంఎస్ ఛైర్మన్గా వడ్రాణం హరిబాబును ప్రభుత్వం నియమించింది.