Guntur Four Died Of Electric Shock: గుంటూరు జిల్లా పెదకాకాని నంబూరు కాళీ గార్డెన్స్ రోడ్డులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాళీ ఆశ్రమంలో విద్యుత్ షాక్తో నలుగురు మృతి చెందారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు.. మృతికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. ఇక, మృతుల డెడ్ బాడీలను గుంటూరులోని జీజీహెచ్ కు పోలీసులు తరలించారు. చనిపోయిన వారిని మహంకాళి రావు, బాలయ్య, రాజేష్, కాళీ బాబులుగా గుర్తించారు.