దేశంలోనే తొలిసారిగా విశాఖలో రూ. 750 కోట్లతో అపెక్స్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతి రానున్న కేంద్రం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు గుంటూరు జిల్లా నడింపాలెంలో రూ. 93.82 కోట్లతో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి (CRIYN) కూడా ఏర్పాటు కానుంది. ఈ మేరకు బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ పార్లమెంట్లో సమాధానం ఇచ్చారు. ఈ యోగా రీసెర్చ్ సెంటర్కు అనుబంధంగా 100 పడకల ఆసుపత్రి నిర్మించనున్నారు.