మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలు నుంచి విడుదలయ్యార పలు కేసుల్లో, 145 రోజులుగా జైలులో ఉంటున్న నందిగం సురేష్ కు వెలగపూడికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. రూ.10వేలు పూచికత్తు సమర్పించిన నందిగం సురేష్ ని జైలు అధికారులు విడుదల చేశారు.. ప్రస్తుతం నందిగం సురేష్ కాలర్ బోన్ నొప్పితో బాధపడుతుండటంతో సురేష్ చికిత్స కోసం విజయవాడ వెళ్లారు.