గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గొంతులో బెలూన్ ఇరుక్కుని నాలుగేళ్ల చిన్నారి చనిపోయిన ఘటన పెదకాకానిలో చోటుచేసుకుంది. నాలుగేళ్ల శిరీష బెలూన్తో ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా బెలూన్ గొంతులోకి వెళ్లిపోయింది. దీంతో ఊపిరి ఆడక చిన్నారి ఇబ్బంది పడింది. అపస్మారక స్థితిలో వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు వెంటనే గుంటూరు జీజీహెచ్కు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.