రాబోయే కాలమంతా ఎలక్ట్రికల్ వెహికల్స్దే. అందుకే గుంటూరులో నగరపాలక సంస్థ ఓ కీలక అడుగు వేసింది. జీఎంసీ పరిధిలో పది ముఖ్యమైన ప్రాంతాల్లో పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. రూ. 3 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించనుంది. జీఎంసీ గుర్తించిన స్థలాల్లో టెండర్ల ద్వారా ఈ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. పదేళ్ల కాల పరిమితితో ఈ ఛార్జింగ్ పాయింట్లను జీఎంసీ ఏర్పాటు చేయనుంది.