Guntur Sankar Vilas Flyover: గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి ఆధునీకరణకు మార్గం సుగమమైంది. భూసేకరణకు దుకాణ యజమానులు అంగీకరించడంతో 21 మందికి రూ.70 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఆరు నెలల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ, రెండేళ్లలో వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రజలంతా సహకరించి, నిర్మాణానికి అడ్డుగా ఉండరాదని కోరారు.