గుడిసె నుంచి డాబాలోకి పేద కుటుంబం.. దటీజ్ చంద్రబాబు, ఆరు నెలల్లోనే కల నెరవేరింది

1 year ago 16
Chandrababu Kept His Promise To Poor Couple: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఓ నిరుపేద కుటుంబానికి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారు. జులై 1వ తేదీన పెనుమాకలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు గ్రామానికి చెందిన నిరుపేద పాములు నాయక్‌ ఇంటికి వెళ్లి పింఛను అందజేశారు. అయితే పాములు నాయక్‌ తనకు సొంతిల్లు కట్టుకునే స్తోమత లేకపోవడంతో పూరి గుడిసెలో ఉంటున్నానని చెప్పారు. తమకు ఇల్లు మంజూరు చేయాలని కోరగా.. వెంటనే పనులు ప్రారంభించి, ఆరు నెలల్లోనే పూర్తి చేశారు.
Read Entire Article