తెలంగాణలో కొర్రమీను క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మంచిర్యాల జిల్లాలో ఈ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లోక్సభలో స్పష్టం చేశారు. దాంతో పాటుగా హైదరాబాద్ నగరంలో అతిపెద్ద హోల్సేల్ చేపల మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇవి అందుబాటులోకి వస్తే తక్కువ ధరకే చేపలు దొరకనున్నాయి.