తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 17.5 లక్షల మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ‘ఉదయం అల్పాహార పథకం’ రాబోయే విద్యాసంవత్సరం నుంచి అమలు కానుంది. తమిళనాడు మోడల్ను అనుసరించి.. ఈ పథకం కింద విద్యార్థులకు పోషక విలువలు గల అల్పాహారాన్ని అందించనున్నారు. దీనికి సంవత్సరానికి సుమారు రూ.400 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు ప్రణాళిక రూపొందించారు. మధ్యాహ్న భోజనానికి అదనంగా ఈ ఉదయం అల్పాహారం అందించడం వల్ల హాజరు శాతం పెరుగుతుందని.. పిల్లల ఏకాగ్రత మెరుగుపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.