Rs 134517 Current Bill under Gruha Jyothi Scheme: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఉచిత విద్యుత్తు అందించేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తోంది. దీని ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వినియోగానికి జీరో బిల్లు జారీ చేస్తారు. కానీ, వరంగల్ జిల్లాలో ఓ లబ్ధిదారుడికి ఏకంగా లక్షన్నర పైగా కరెంట్ బిల్లు రావడంతో షాక్ అయ్యారు. జీరో బిల్లు రావాల్సిన చోట ఇంత భారీ మొత్తం రావడంతో అతడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఆ వివరాలు..