గొప్ప మనసు చాటుకున్న జగ్గారెడ్డి.. క్యాన్సర్ పేషెంట్‌కి రూ.10 లక్షల సాయం..

1 year ago 27
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సదాశివపేటకు చెందిన క్యాన్సర్ బాధితురాలు ఆమనిని పరామర్శించి.. వైద్య ఖర్చుల కోసం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో బాధపడుతున్న ఆమని పరిస్థితిని తెలుసుకుని చలించిన జగ్గారెడ్డి, ఆమెకు ధైర్యం చెప్పారు. పేద క్యాన్సర్ బాధితుల కష్టాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు. ఇలాంటి నిరుపేద క్యాన్సర్ బాధితులకు అండగా నిలబడటానికి దాతలందరూ ముందుకు రావాలని ఆయన వినమ్రంగా విజ్ఞప్తి చేశారు.
Read Entire Article