గొర్రెల పంపిణీ పథకం.. ఈడీ సంచలన ప్రకటన.. రూ.1,000 కోట్లకు పైగానే..

10 months ago 18
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ గొర్రెల పంపిణీ పథకంలో రూ. వెయ్యి కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ప్రకటించింది. లబ్ధిదారులకు అందాల్సిన డబ్బును ప్రైవేటు ఖాతాలకు మళ్లించారని.. నిజంగా గొర్రెలను కొనడం, అమ్మడం జరగలేదని ఈడీ చెప్పింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ ఇంట్లో సోదాలు చేసి 200కు పైగా బ్యాంక్ ఖాతాల పత్రాలు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు ఈ ఖాతాలను వాడినట్లు తేలింది. కాగ్ నివేదిక కూడా ఈ అక్రమాలను గుర్తించింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది.
Read Entire Article