వేములవాడ ఆలయంలో గోవుల మరణాలు కలకలం రేపడంతో రేవంత్ సర్కార్ స్పందించింది. గోవుల సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయడానికి కమిటీని నియమించారు. గోవుల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎంత ఖర్చయినా వెనకాడవద్దని సీఎం అన్నారు. వేములవాడలో వంద ఎకరాల్లో గోశాల నిర్మించాలని ఆదేశించారు. దీని కోసం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. గో సంరక్షణకు వేరే రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించాలని తెలిపారు.