జగిత్యాల జిల్లా కోటిలింగాలకు చెందిన ఎనిమిదేళ్ల మణితేజ 15 నెలల క్రితం కుక్కకాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడికి అప్పట్లో టీకా ఇప్పించినా.. ఆ తర్వాత అకస్మాత్తుగా జ్వరం రావడంతో పరిస్థితి విషమించింది. వెన్నెముక నుంచి మెదడుకు వెళ్లే నరం దెబ్బతినడంతో.. సుమారు 50 లక్షలు ఖర్చు చేసి వెంటిలేటర్పై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.