తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 22 నుంచి రైతు భరోసా నిధులను మూడు విడతల్లో జమ చేయనుంది. మొదటి విడతగా సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు గాను రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కాగా, ఫిబ్రవరి 28, 2026 లోపు కొత్తగా పట్టా పొందిన రైతులు తమ ఆధార్, పాస్ బుక్ వివరాలతో రైతు వేదికల్లో రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.