భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం 32.5 అడుగులు దాటింది. ఎగువ వరదలతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పర్ణశాల, తాలిపేరు జలాశయం వద్ద వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. భద్రాచలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.