కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు సౌకర్యవంతంగా చేరుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోదావరి ఏటిగట్టు మీదుగా నేరుగా ఆలయాన్ని చేరుకునే నూతన రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపారు. తక్షణమే రూ. 6 కోట్లు మంజూరు చేశారు. రావులపాలెం మీదుగా ఉన్న ఇరుకు రోడ్డు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి ఈ 7 కిలోమీటర్ల కొత్త మార్గం ఉపయోగపడుతుంది.