తెలంగాణలోని ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు తమ బయోమెట్రిక్ ఈ-కేవైసీ ప్రక్రియను ఈ నెల 30 లోపు ఖచ్చితంగా పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ సూచించింది. అక్రమ గ్యాస్ కనెక్షన్లను అరికట్టడానికి, రాయితీ దుర్వినియోగాన్ని ఆపడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. వినియోగదారులు మొబైల్ యాప్, సిలిండర్ డెలివరీ బాయ్స్ లేదా గ్యాస్ ఏజెన్సీల ద్వారా వేలిముద్రలు, ముఖ గుర్తింపు లేదా ఐరిస్ విధానాల్లో దీనిని పూర్తి చేయవచ్చు. అయితే, ఈ-కేవైసీ పెండింగ్లో ఉందనే నెపంతో సిలిండర్ల బుకింగ్ను ఆపకూడదని ఏజెన్సీలను ప్రభుత్వం హెచ్చరించింది.