వంట గ్యాస్ సిలిండర్ల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) పంపిణీని వేగవంతం చేస్తోంది. పీఎన్జీ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో మూడు నెలల తర్వాత ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిలిపివేస్తామని కేంద్రం ప్రకటించడంతో ప్రజలు కనెక్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కరీంనగర్, పెద్దపల్లి వంటి ప్రాంతాల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పైపులైన్ పనులు జరుగుతున్నాయి. సిలిండర్ అయిపోతుందనే ఆందోళన లేకుండా.. నిరంతర సరఫరా, అధిక భద్రత ఉండటంతో పీఎన్జీకి ఆదరణ పెరుగుతోంది.