ల్యాండ్ కన్వర్షన్పై విధించే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జీల (ఈడీసీ) పంపిణీలో కీలక మార్పులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు అర్భన్ డెవలప్మెంట్ అథారిటీలు (యూడీఏ), గ్రామపంచాయతీలకు వేర్వేరుగా, అటోమెటిక్గా ఈ ఫీజును పంపిణీ చేసేందుకు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టంలో (డీపీఎంఎస్) అధికారులు మార్పులు చేశారు. ఇకపై ఈడీసీలో 85 శాతం గ్రామ పంచాయతీలకు, 15 శాతం యూడీఏలకు వెళ్తాయి. ఇంతకుముందు మొత్తం యూడీఏ ఖాతాల్లోకి వెళ్లేవి.