గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరుపై అభిప్రాయ సేకరణ.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం..

4 months ago 22
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరపాలని నిర్ణయించింది. క్యూఆర్ కోడ్ విధానం ద్వారా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల పనితీరుపై అభిప్రాయాలు సేకరించనున్నారు. ఈ నేపథ్యంలో క్యూఆర్ కోడ్ పోస్టర్లు ఏర్పాటు చేయాలని.. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖ సహాయకులు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఈ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
Read Entire Article