ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్య గమనిక. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనాభా ఆధారంగా ఉద్యోగులను కేటాయించనున్నారు. ఈ క్రమంలోనే సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీ సచివాలయానికి ఆరుగురు, బీ కేటగిరీలోని సచివాలయాలకు ఏడుగురు, సీ కేటగిరీలోని సెక్రటేరియట్లకు ఎనిమిది మంది ఉద్యోగులను కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.