గ్రామ సచివాలయాల పేరు మార్చుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు గ్రామ సచివాలయాలు అని పిలిచిన వాటిని ఇక నుంచి విజన్ యూనిట్స్గా పిలవాలని పేర్కొంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే గ్రామ సచివాలయాలను విజన్ యూనిట్స్గా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.