ఏపీలోని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. ఇక మాట ప్రకారం ఇళ్ల స్థలాల పంపిణీపై కసరత్తు జరుగుతోంది. అర్హులను గుర్తించేందుకు విధివిధానాలు నిర్ణయించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. అర్హులకు ఇంటి పట్టాలు అందిస్తామన్న ఆయన.. ఇందుకోసం త్వరలోనే విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు చెప్పారు.