కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీల పరిధిలో ఇంటి నంబరుతో ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అనుమతి లభించింది. అక్రమ రిజిస్ట్రేషన్లను నిరోధించడానికి, పారదర్శకతను పెంచడానికి ఇంటి కొలతలు, విస్తీర్ణం, ఎన్వోసీ వంటి నిబంధనలు తప్పనిసరి చేశారు. ఈ నిర్ణయంతో గ్రామాల్లో క్రయవిక్రయదారులకు ఊరట లభించింది. అయితే, పురపాలికలు, నగరపాలికల్లో, ముఖ్యంగా కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండితో పాటు కొత్తపల్లి, రేకుర్తిలోని 200 సర్వే నంబర్లలో ఇంకా రిజిస్ట్రేషన్లపై స్పష్టత లేకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.