తెలంగాణ గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళిక చేపట్టింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద తొలి దశలో 98 నియోజకవర్గాల్లో రూ.16 వేల కోట్లతో 7,450 కిలోమీటర్ల మేర 2,162 రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఈ పనులను సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు 16న ములుగులో ప్రారంభించనున్నారు. నిర్మాణ వ్యయంలో 40 శాతం ప్రభుత్వం, 60 శాతం నిర్మాణ సంస్థలు భరించనున్నాయి. పనులను 30 నెలల్లో పూర్తి చేసి అనంతరం 15 ఏళ్లపాటు రహదారుల నిర్వహణ బాధ్యతను సంస్థలే చేపట్టనున్నాయి. గ్రామీణ కనెక్టివిటీ, వ్యవసాయ రవాణా, విద్య, వైద్య సేవలకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది.