పర్యావరణహిత గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో భాగంగా సింగరేణి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికుల నివాస గృహాలపై రూఫ్ టాప్ సౌర ఫలకాలను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. సుమారు రూ. 65 కోట్ల వ్యయంతో 15 వేల కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల సంస్థపై ప్రతి నెలా పడుతున్న రూ. 50-60 కోట్ల విద్యుత్ బిల్లుల భారం కొంత మేర తగ్గనుంది.