గ్రేటర్ హైదరాబాద్లో ఇసుక కొరత తీర్చడానికి తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (TSMDC) కొత్తగా నాలుగు ఇసుక బజార్లను ప్రారంభించింది. సన్న ఇసుక టన్ను రూ. 1800, దొడ్డు ఇసుక రూ. 1600 చొప్పున విక్రయిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లి, అబ్దుల్లాపూర్ మెట్, ఆదిభట్ట, మేడ్చల్ జిల్లాలోని భౌరంపేటలో ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదుల రీచ్ల నుంచి ఇసుక వస్తుండగా.. వర్షాకాల కొరతను ఈ బజార్లు తీరుస్తాయి.