గ్రేటర్ హైదరాబాద్తో పాటుగా జిల్లాల్లోని ప్రధాన పట్టణాలు, నగరాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. నగరాల్లో జీ+3 విధానంలో ఇళ్లు నిర్మించనుంది. గ్రేటర్ హైదరాబాద్లోని 16 మురికివాడల్లో ఇప్పటికే స్థలాలను గుర్తించారు. ఐఎస్ సదన్, దిల్సుఖ్నగర్లోని కొన్ని ప్రాంతాలు అనుకూలంగా ఉండగా.. మిగిలిన చోట్ల వివాదాలున్నట్లు గుర్తించారు. వివాదాలు పరిష్కారం అయిన తర్వాత.. ఆయా ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించనున్నారు.