చర్లపల్లి- ఘట్కేసర్ రైల్వేట్రాక్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండ్రోజుల క్రితం విజయ రెడ్డి ఆమె ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకోగా.. అందుకు కారణం ఒంటరితనమేనని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. భర్త ఉద్యోగరిత్యా దుబాయ్లో ఉండటం.. పిల్లలు హాస్టల్స్లో ఉండటంతో ఒంటరితనం భరించలేక ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నారు.