జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో మహిళా ఎస్సై ప్రాణాలు కోల్పోయింది. జగిత్యాల జిల్లా పోలీస్ డీసీఆర్బీలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శ్వేతతో పాటు ద్విచక్రవాహనంపై ఉన్న వాహనదారుడు తీవ్ర గాయాలతో మృతి చెందారు. ఎస్ఐ శ్వేత ధర్మారం నుంచి జగిత్యాలకు కారులో వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. కారు అతి వేగంగా ఉండటంతో ప్రమాదం తర్వాత రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఓ చెట్టును ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో ఎస్సై శ్వేత స్పాట్లోనే కన్నుమూసింది.