హైదరాబాద్ చందానగర్లో ఖజానా జ్యువెలరీ షోరూంలో మంగళవారం పట్టపగలే తుపాకీలతో చొరబడిన ఆరుగురు దుండగులు బీభత్సం సృష్టించారు. ఒక ఉద్యోగిపై కాల్పులు జరిపి 10 కిలోల వెండి, 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలను దొంగిలించి పరారయ్యారు. అయితే దుకాణం మేనేజర్ లాకర్ తాళం ఇంటి వద్ద మరిచిపోవడంతో 100 కిలోల బంగారం, కోట్ల విలువైన వజ్రాలు చోరీ కాలేదు. ఈ ఘటనపై పోలీసులు 10 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు.