హైదరాబాద్లోని చందానగర్లో ఖజానా జ్యువెలర్స్ షోరూంలో దోపిడీ కలకలం రేపింది. ముసుగు ధరించిన దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి.. వెండి నగలు దోచుకెళ్లారు. కాల్పుల్లో షోరూం డిప్యూటీ మేనేజర్ తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.