తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలో ఏనుగుల సంచారంపై డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలను అప్రమత్తం చేశారు. అటవీ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏనుగుల కదలికలపై డ్రోన్లతో నిఘా ఉంచాలని.. అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ గస్తీ పెంచాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో ప్రజలకు సమాచారం అందించాలని.. హనుమాన్ బృందాలను మోహరించాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.