విజయవాడకు వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక. చంద్రగ్రహణం కారణంగా దుర్గ గుడి దేవస్థానం అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రగ్రహణం నేపథ్యంలో ప్రధాన ఆలయం, ఉపాలయాలు కవాట బంధనం చేయనున్నారు. చంద్రగ్రహణం పూర్తైన తర్వాత ఆలయ తలుపులు తెరవనున్నారు. అలాగే ఇంద్రకీలాద్రిపై పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గిరి ప్రదక్షిణ కార్యక్రమం కూడా రద్దు చేసినట్లు దుర్గ గుడి దేవస్థానం అధికారులు తెలిపారు.