Ys Sharmila On Power Charges: గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలపై చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి.. ఆ పాపపు పరిహారాన్ని ప్రజలపై మోపడం సరికాదన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో విద్యుత్ ఛాార్జీలు పెంచితే.. తాము తగ్గిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేస్తే ఊరుకోమని.. మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు షర్మిల.