దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల ఇదే విషయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశాలతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పలు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణాలకు ఉచితంగా స్థలాలు కేటాయించాలని లేఖలో కోరారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదన్న టీటీడీ ఛైర్మన్.. సమాజ అభివృద్ధికి తోడ్పడుతాయని వివరించారు.