తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ అధినేతలకు ఒక విజ్ఞప్తి చేశారు. విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయిన జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వ్యక్తికి అవకాశం కల్పించడం గర్వకారణమని పేర్కొన్నారు. జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపి.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి రాజ్యాంగాన్ని పరిరక్షకుడే కాకుండా.. రాజ్యాంగ నిపుణుడు కూడా అని పేర్కొన్నారు.