ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఏపీ దశ దిశ మారాలంటే కావాల్సింది విజన్లు కాదనీ.. విభజన హామీల అమలు అంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు. దశాబ్దకాలంగా విభజన హామీల అమలుకు దిక్కు లేకుండా పోయిందన్న వైఎస్ షర్మిల.. ఇందులో నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ ముద్దాయిలని మండిపడ్డారు. ఇప్పటికైనా ఏపీ విభజన హామీల అమలు కోసం ప్రయత్నించాలని డిమాండ్ చేశారు.